ఢిల్లీ వేదికగా ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ బౌలర్లు రాణిస్తున్నారు. వరుస వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు. ప్రస్తుతం 53 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది ఆసీస్. లంచ్ బ్రేక్ తర్వాత 94/3 స్కోరుతో ఆటను ప్రారంభించిన ఆసీస్ 108 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ (12)ను షమీ ఔట్ చేశాడు. తర్వాత ఖవాజా- హ్యాండ్స్ కాంబ్ జోడి భారత్ బౌలర్లకు ఎదురొడ్డి నిలచింది. వీరిద్దరు ఐదో వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ప్రమాదకరంగా మారారు. ఈ సమయంలో ఒంటరి పోరాటం చేస్తున్న ఉస్మాన్ ఖవాజాను (125 బంతుల్లో 81)ను జడేజా ఔట్ చేసి కంగారులను దెబ్బకొట్టాడు.తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీనీ అశ్విన్ డకౌట్గా వెనక్కు పంపాడు. ప్రస్తుతం క్రీజ్లో హ్యాండ్స్ కాంబ్(33), కమ్మిన్స్(15) ఉన్నారు. అశ్విన్ 3, షమీ 2, జడేజా ఓ వికెట్ దక్కించుకున్నారు.