బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కోసం భారత్-ఆసీస్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నాగ్పూర్ చేరుకున్న ఇరుజట్లు ప్రాక్టీస్ను మొదలు పెట్టేశాయి. తాజాగా టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్తో బిజీగా ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్లో విరాట్ కోహ్లి, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజాలు మైదానంలో చెమటోడ్చుతున్నారు. నాలుగు మ్యాచ్ల ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9న మొదలుకానుంది.
#TeamIndia have begun their preparations for the Border Gavaskar Trophy ahead of the 1st Test in Nagpur.#INDvAUS pic.twitter.com/21NlHzLwGA
— BCCI (@BCCI) February 3, 2023
డబ్ల్యూటీసీ ఫైనల్పై గురి
కొత్త సంవత్సరంలో వరుస సిరీస్లు గెలుచుకున్న ఊపుతో ఆసీస్తో టెస్ట్ సిరీస్కు భారత్ సిద్ధమైంది. అయితే వన్డే, టీ 20 సిరీస్లు కైవసం చేసుకున్న భారత్ ఆటగాల్లు టెస్టుల్లో ఎలా ఆడతారన్నది వేచి చూడాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ఈ సిరీస్లో రెండు జట్లు ముందజ వేయాలి. దీంతో ఈ సిరీస్ రసవత్తరంగా సాగనుంది. టీమ్ ఇండియా ఫైనల్ బెర్తు ఖరారు కావాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3 -0 లేదా అంతకంటే ఎక్కువ తేడాతో గెలవాలి.
అశ్విన్ డూప్తో ప్రాక్టీస్
ఉపఖండ పిచ్లపై స్పిన్ బౌలింగ్లో ఇబ్బంది పడే ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేక సాధన చేస్తున్నారు. ఇందుకోసం ఓ పిచ్ తయారు చేసుకొని దానిపై ప్రాక్టీస్ మొదలు పెట్టారు. మరోవైపు భారత్ స్పిన్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం దృష్టిసారించారు. అందుకోసం ఫ్లైటెడ్ డెలివరీలతో వికెట్లు పడగొట్టే అశ్విన్ వంటి రనప్, శైలీ ఉన్న బరోడ స్పిన్నర్ మహేష్ను పిలిపించుకొని అతని బౌలింగ్లో సాధన చేస్తున్నారు. అశ్విన్ను అడ్డుకోవడం కోసం ఆసీస్ బ్యాటర్లు నెట్స్లో అశ్విన్ డూప్ బౌలింగ్ను ఎక్కువగా ఆడుతున్నారు. ఏదేమైనా స్వదేశంలో భారత్ స్పిన్నర్స్ను ఎదుర్కోవాలంటే ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు కత్తిమీద సామే.
Mahesh Pithiya grew up being called “Ashwin” owing to his uncanny impersonation of his idol @ashwinravi99 & he ended up ‘playing’ Ashwin for Australia in their first training session on tour & making a big impression on Steve Smith. Here’s how #IndvAus https://t.co/GnAd63DFN6 pic.twitter.com/BgNwOWGDC6
— Bharat Sundaresan (@beastieboy07) February 3, 2023