దేశంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ పూర్తయ్యే కొత్త ఫోన్ ని ప్రముఖ మొబైల్ సంస్థ ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి తీసుకురానుంది. జీరో అల్ట్రా పేరుతో వస్తున్న ఈ 5జీ ఫోన్.. 180 వాట్ల సామర్ధ్యంతో కేవలం 12 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ నెల 25 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ. 29,999 గా నిర్ణయించినట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్న ఈ ఫోన్ 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్, మరో 2 ఎంపీ డెప్త్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ లాక్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది.