Home > క్రికెట్ > ఐపీఎల్‌కు అంబటి రాయుడు రిటైర్మెంట్

ఐపీఎల్‌కు అంబటి రాయుడు రిటైర్మెంట్

Ambati Rayudu announces IPL retirement

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గుజరాత్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచే తనకు చివరిది అని ప్రకటించాడు. మరొకసారి యూ టర్న్ తీసుకునే అవకాశం లేదని రాయుడు ట్వీట్ చేశాడు. మ్యాచ్‌కు కాసేపటి ముందు రాయడు తన రిటైర్మెంట్ ప్రకటన చేయడం విశేషం.

ధోనికిదే చివరి మ్యాచ్ అని వార్తలు వస్తున్న సమయంలో అదే జట్టుకు చెందిన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. నిజానికి గత సీజన్ సమయంలోనే ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు ఈ తెలుగు ఆటగాడు ట్వీట్ చేశాడు. అయితే కాసేపటికే తన మనసును మార్చొకొని తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు తాజాగా మరొకసారి రిటైర్మెంట్ ప్రకటించాడు రాయుడు.

2010లో ముంబై ఇండియన్స్‌తో తన IPL కెరీర్‌ను అంబటి రాయుడు ప్రారంభించాడు. 2018 నుంచి సీఎస్కేకు ఆడుతున్నాడు. మొత్తం 14 సీజన్ లు ఆడిన రాయుడు.. 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీల్లో భాగమయ్యాడు. 2018లొ సీఎస్కే ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 602 పరుగులు చేశాడు. ప్రస్తుతం సీజన్ లో మాత్రం రాయుడు తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తం 15 మ్యాచ్‌లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేశాడు. రాయుడు వరుసుగా విఫలమైనప్పటికీ జట్టులో కొనసాగుతూ వచ్చాడు.

రాయుడు రిటైర్మెంట్‌ను ముందుగానే అభిమానులు ఊహించారు. ఆయన గత కొద్ది రోజులుగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తుండడంతో క్రికెట్‌ను వీడే అవకాశం ఉందని అంచనాకు వచ్చేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించడం…. ఇటీవల స్వయంగా వెళ్లి కలవడంతో రాయుడు రాజకీయా ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. ఇంతలోనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతూ ప్రకటన చేశాడు.

Updated : 28 May 2023 8:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top