Home > Featured > ఐపీఎల్ ఛాంపియన్స్పై కోట్ల వర్షం.. ఎమర్జింగ్ ప్లేయర్కు భారీ ప్రైజ్ మనీ

ఐపీఎల్ ఛాంపియన్స్పై కోట్ల వర్షం.. ఎమర్జింగ్ ప్లేయర్కు భారీ ప్రైజ్ మనీ

IPL 2023 Winning Team Will Get Huge Amount Of Money This Time

ఐపీఎల్ 2023 సమరం తుది అంకానికి చేరుకుంది. రేపు (మే 28) అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో చెన్నై, గుజరాత్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్యాష్ లీగ్లో ప్రతిభ ఉన్న వాళ్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయం తెలిసింది. అయితే, ఈ లెక్కన ఐపీఎల్ ఛాంపియన్కు, ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయిన జట్లకు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ అందిస్తారో తెలుసా..?

ఈ ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు, రన్నరప్ కు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ఓ నివేదికలో తెలిపింది. ఎలిమినేటర్ విజేత ముంబైకి రూ. 7 కోట్లు, ఎలిమినేటర్లో ఓడిపోయిన లక్నోకు రూ. 6.5 కోట్ల నగదు బహుమతి దక్కనుంది.

ఏ ఆటగాడికి ఎంతంటే..

ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు సాధించిన వ్యక్తికి ఆరెంజ్ క్యాప్తో పాటు ప్రైజ్ మనీగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం 16 మ్యాచుల్లో 851 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ .. అగ్రస్థానంలో ఉన్నాడు. అతనికి పోటీగా ఏ ప్లేయర్ బరిలో లేడు. పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడికి కూడా రూ. 15 లక్షల ప్రైజ్ మనీ దక్కనుంది. ఈ రేసులో గుజరాత్ టీం సభ్యులు షమీ (28), రషీద్ ఖాన్ (27), మోహిత్ శర్మ (24) ముందున్నారు. ఈ సీజన్లో సూపర్ స్ట్రైక్ అవార్డు గెలుచుకున్న బ్యాట్స్మెన్కు ప్రైజ్ మనీగా రూ. 15 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్కు రూ. 20 లక్షలు ఇవ్వనున్నారు.

Updated : 27 May 2023 6:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top