స్కూల్లో టీచర్లు హాజరు తీస్కున్నప్పుడు మామూలుగా పిల్లలు ఏమంటారు. ప్రజెంట్ మేడం,ప్రజెంట్ సార్ ,లేక ఎస్ టీచర్, అని అంటారు కదా…కనీ మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ లోని సాత్నా జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ విచిత్రమైన నిబంధన పెట్టారు. టీచర్లు హాజరు తీస్కున్నప్పడు ఎస్ మేడం ,ఎస్ సార్ కు బదులుగా జైహింద్ అని అనాలట.
అలా ఎందుకంటే దీనివల్ల పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందని ఆ స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అక్కడి సీయం శివరాజ్ సింగ్ చౌహన్ అనుమతితో మధ్య ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేసేలా చూస్తామని చెబుతున్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్లగానే దేశభక్తి గీతాలు ఎలాగో పాడతారు. కొత్తగా ఈ జైహింద్ నినాదం అనే ఆలోచన బాగుందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.