జయలలిత పోయస్ గార్డెన్ బంగ్లా స్వాధీనం! - Telugu News - Mic tv
mictv telugu

జయలలిత పోయస్ గార్డెన్ బంగ్లా స్వాధీనం!

May 22, 2020

Jayalalitha

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న ‘వేద నిలయం’ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి తమిళ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేసింది. జయలలిత మరణం తరువాత ఆ బంగ్లాలో ఆమె సన్నిహితురాలు శశికళ కొన్నాళ్లు ఉన్నారు. శశికళ జైలుకు వెళ్లడంతో ప్రస్తుతం ఆ బంగళా ఖాళీగా ఉంది.

ఈ నేపథ్యంలో ‘వేద నిలయం’ బంగ్లాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వ ఆర్డినెన్స్ వెలువడింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సంతకం చేశారు. ఈ బంగ్లాను జయలలిత స్మారక మ్యూజియంగా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని సమాచారం. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే మ్యూజియం పనులు ప్రారంభం అవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వస్తువులు, సమాచారాన్ని ఇందులో భద్రపరచనున్నారు.