దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు రిలయన్స్ సంస్థ జియో గుడ్న్యూస్ చెప్పింది. సరికొత్త ఆఫర్తో మరోసారి ముందుకొచ్చినట్లు తెలిపింది. గత సంవత్సరం అక్టోబరులో విడుదలైన జియో నెక్స్ట్ ఫోన్పై ఎక్స్చేంజ్ ఆఫర్ను ప్రకటించినట్లు పేర్కొంది.
ప్రస్తుతం మార్కెట్లో జియో నెక్స్ట్ ఫోన్ ధర రూ. 6,499గా ఉంది. ఏదైనా 4జీ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 2 వేల తగ్గింపుతో ఫోన్ను సొంతం చేసుకోవచ్చని జియో తెలిపింది. ఈ ఆఫర్ పరిమిత కాలమే అందుబాటులో ఉంటుందని సూచించింది.
”ఈ ఫోన్.. 5.45 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ, మెమరీని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో స్నాప్ డ్రాగన్ 215 క్యూఎం ప్రాసెసర్, 13 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. డ్యూయల్ సిమ్ కలిగిన ఈ ఫోన్ ‘ప్రగతి ఓఎస్’పై పని చేస్తుంది. ఈ ఫోన్ను తొలుత రూ. 1,999 చెల్లించి వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18/24 నెలల్లో సులభ వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. డిస్కౌంట్ ఆఫర్కు కూడా ఇన్స్టాల్మెంట్ వర్తిస్తుంది”.