తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. తాతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఉదయం 7 గంటల సమయంలో హీరో నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరుడు రామకృష్ణ, హరికృష్ణ కూతురు, టీడీపీ నేత నందమూరి సుహాసిని మరియు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని,.. పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.
ఇక తారక్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చిన సమయంలో ఫ్యాన్స్ అంతా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభలు, ర్యాలీల్లో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాలనే స్లోగల్స్ రెగ్యులర్గా వినిపించేవే. ఇప్పుడు వర్థంతి వేళ కూడా తాతకు వారసుడిగా తారక్ను చూడాలని కోరుకుంటూ ఫ్యాన్స్ జైకొట్టారు.
ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. పలు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్ అంటూ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకోనున్నారు.