రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్లతోపాటు, మరో నాలుగు సహకార బ్యాంకులపై తీవ్రంగా మండిపడింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించలేదని కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్లకు రూ.కోటి చొప్పున జరిమానాను విధిస్తూ, సెంట్రల్ బ్యాంక్ ఉత్తర్వులను జారీ చేసింది.
సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ”డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే కస్టమర్ ప్రొటెక్షన్ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్పై రూ. 1.05 కోట్ల పెనాల్టీ విధించినట్లు పేర్కొంది. నిర్దిష్ట నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించనందుకు ఇండస్ ఇండ్ బ్యాంక్పై రూ. 1 కోటి జరిమానా విధించినట్లు వివరించింది. నవ్ జీవన్ కో–ఆపరేటివ్ బ్యాంక్, బలంగీర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ధాకురియా కోఆపరేటివ్ బ్యాంక్ (కోల్కతా), ది పళని కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్పై రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.”