తెలంగాణ మంత్రి కేటీఆర్ విషాదంలో ఉన్నారు. ఆయన మామ హరినాథరావు బుధవారం రాత్రి 8.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. మంగళవారం సాయంత్రం హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా, బుధవారం ఆరోగ్యం క్షీణించి మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో కేటీఆర్ తన సతీమణి శైలిమతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. అటు హరినాథరావు భౌతికకాయాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు. హరినాథరావు మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
టీడీపీ కార్యకర్తల మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం