ఏపీ ప్రభుత్వానికి లలిత జ్యూయలర్స్‌ భారీ విరాళం - Telugu News - Mic tv
mictv telugu

ఏపీ ప్రభుత్వానికి లలిత జ్యూయలర్స్‌ భారీ విరాళం

May 13, 2020

Lalitha

లాక్ డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం తగ్గిన సంగతి తెల్సిందే. ఉద్యోగులకు మొత్తం జీతం కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. ఈ విపత్కర సమయాల్లో ప్రభుత్వానికి డబ్బు ఎంతో అవసరం. ఈ విషయం అర్థం చేసుకున్న కొందరు దాతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా సీఎం, పీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. 

తాజాగా లలితా జ్యువెలరీస్ అధీనేత కిరణ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు సీఎం‌ జగన్ ను ఆయన ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ లో కలిసి చెక్కును అందచేశారు. ఇటీవల తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలకు చెరో కోటి రూపాయల విరాళం అందించారు.