హర్యానా రాష్ట్రం పానిపట్లోని బహరంపూర్ గ్రామంలో ఓ చిరుత పులి అటవీశాఖ అధికారులపై పంజా విసిరిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ”చిరుత పులి ఆకస్మాత్తుగా ఓ అధికారిపై దాడి చేసింది. దాంతో పక్కనే ఉన్న మరో అధికారి వెంటనే పరిగెత్తుకు వచ్చి, ఆ చిరుత పులిని పక్కకు పడేశాడు. వెంటనే అతడిపై దాడి చేసింది. అంతలోనే అక్కడే ఉన్న మరికొందరు అధికారులు చిరుత దాడిని అడ్డుకునేందుకు కర్రలతో ప్రయత్నం చేశారు. చివరకు చిరుతపులికి స్పృహ కోల్పోయేలా చేసి, దానిని బంధించారు.”
Tough day at work for people from police and forest dept.. A couple of them suffered injuries..Salute to their bravery and courage..In the end, everyone is safe..Including the leopard.. pic.twitter.com/wbP9UqBOsF
— Shashank Kumar Sawan (@shashanksawan) May 8, 2022
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి శశాంక్ కుమార్ సావన్ మే 8న తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘అటవీశాఖ అధికారులకు కఠినమైన రోజు, వారి ధైర్యానికి వందనం. చివరకు చిరుతతోపాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు’ అంటూ ట్విట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పోలీసుల ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.