Home > Featured > రాష్ట్రపతి ఎన్నికల బరిలో జాతిపిత మనవడు?

రాష్ట్రపతి ఎన్నికల బరిలో జాతిపిత మనవడు?

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహించిన విపక్షాల భేటీ ముగిసింది. సమావేశం ముగిసిని అనంతరం దీదీ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రపతి అభ్యర్ధిగా అందరం ఏకగ్రీవంగా శరద్ పవార్‌ను ఎన్నుకున్నాం. కానీ, ఆయన తిరస్కరించడంతో మరోసారి చర్చించేందుకు ఈ నెల 21న మరోసారి భేటీ అవుతాం.

అభ్యర్ధిగా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీతో పాటు జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను పరిశీలిస్తున్నాం. దీంతోపాటు ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక కోసం ఓ ప్రత్యేక కమిటీని కూడా నియమిస్తున్నాము. కమిటీ నివేదిక తర్వాత పేరు ప్రకటిస్తామ’ని వెల్లడించారు. కాగా, మాజీ దౌత్యవేత్త అయిన గోపాల కృష్ణ గాంధీ గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. 2017లో ఉప రాష్ట్రపతిగా విపక్షాల నుంచి పోటీ చేయగా, ఎన్డీఏ అభ్యర్ధి వెంకయ్యనాయుడు విజయం సాధించారు.

Updated : 15 Jun 2022 8:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top