దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. సిగరెట్ కొనుక్కోవడానికి 10 రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తిని నలుగురు యువకులు దారుణంగా హత్య చేశారు. జూన్ 5న ఈ ఘటన జరిగింది. నలుగురు నిందితులు ఆనంద్ పర్బత్ ప్రాంతం నుంచి వస్తున్నారు. ఆ సమయంలో హెచ్ఆర్ రోడ్డు వద్ద సిగరెట్ తాగుతూ కూర్చున్న బాధితుడు విజయ్ను పది రూపాయలు అడిగారు. అతడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో నిందితులు.. బాధితుడితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గొడవ ముదిరి నలుగురు కలిపి విజయ్ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.