Home > Featured > హైదరాబాద్‌‌ చేరుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

హైదరాబాద్‌‌ చేరుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

Satya Nadella.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి నాదెళ్ల యుగంధర్ అంత్యక్రియలు ఈరోజు 11:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగనున్నాయి. తన తండ్రి అంత్యక్రియల కోసం సత్య నాదెళ్ల శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌‌కు చేరుకున్నారు. 82 ఏళ్ల యుగంధర్ శుక్రవారం నాడు మృతిచెందిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రిలో ఆయన భౌతికకాయం ఉండగా, మరికాసేపట్లో భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించనున్నారు.

Updated : 15 Sep 2019 12:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top