ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పూర్ వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని ఖమ్మంకు చెందిన 26 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. వీరంతా ఈ నెల 10న అయోధ్య సందర్శనకు వెళ్లారు. సందర్శన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 3.30గంటలకు లఖ్నవూ- వారణాసి జాతీయ రహదారిపై ఘటన జరిగింది. సుల్తాన్పూర్ వద్ద మరో వాహనాన్ని ఢీకొన్న మినీ బస్సు బోల్తా పడింది. గాయపడిన వారిని లంబువా సీహెచ్సీ నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు.