హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే లంచం డిమాండ్ చేస్తున్న ఓ డాక్టర్ నిర్వాకం వెలుగు చూసింది. తనిఖీకి వచ్చిన మంత్రిని చూసి… అదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన తమని డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్న హరీశ్ రావు…. అక్కడికక్కడే ఆ డాక్టర్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటివి మళ్లీ రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్లను హెచ్చరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పలు వైద్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గైనకాలజి వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని చెప్పారు. ఆస్పత్రికి అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని హామీ ఇచ్చారు. గైనకాలజి వార్డులో సదుపాయాలను పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. 60శాతం పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ డెలివరీలను ఇంకా పెంచాలని సూచించారు.
మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022