ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ‘మీర్జాపూర్ 2’ అనే వెబ్ సిరీస్ను నిషేధించాలని ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ అప్నా దల్ ఎంపీ అనుప్రియా పాటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఆమె దేశ ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్లకు లేఖలు రాసారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ జాతి అసమానతలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. అలాగే ఈ వెబ్ సిరీస్లో మీర్జాపూర్ పట్టణాన్ని ఓ హింసాత్మక ప్రదేశంగా చూపిస్తూ దాని పేరు చెడగొడుతోందని మండిపడ్డారు. దీంతో ఈ వెబ్ సిరీస్ గురించి విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. 2018లో వచ్చిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ కు సీక్వెల్గా ఈ సిరీస్ వచ్చింది. ఇందులో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, హర్షితా శేఖర్, శ్వేత త్రిపాఠి, అమిత్ సియాల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్లు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్కు గుర్మీత్ సింగ్, కరణ్ అన్షుమన్లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్ మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ దీన్ని సంయుక్తంగా నిర్మించారు.