కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష సక్సెస్..
Editor | 11 Sep 2019 11:21 AM GMT
కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఓర్వకల్లు వద్ద డీఆర్డీవో నిర్వహించిన క్షిపణి పరీక్షను ఆర్మీ సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం 4గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం చేయడానికి ప్రత్యేక బృందం ఢిల్లీ నుంచి వచ్చింది. తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను డీఆర్డీవో పరీక్షించింది.
రెండున్నర కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మిస్సైల్ ఛేదించింది.ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా డీఆర్డీవో ఈ క్షిపణిని రూపొందించింది. అనుకున్న సమయం ప్రకారం ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు పేర్కొన్నారు. థర్డ్ జనరేషన్ క్షిపణిగా డీఆర్డీవో పేర్కొంది. కాగా, శాస్త్రవేత్తలకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అభినందనలు తెలిపారు.
Updated : 11 Sep 2019 12:10 PM GMT
Tags: Army Help Congratulations Defense Minister Rajnath Singh Drdo kurnool district Missile Test Orvakal success
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire