విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఓ మాజీ మంత్రిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. త్రిపుర మాజీ మంత్రి మెవార్ కుమార్ జమతియా తనను వేధించినట్లు బాధితురాలు డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసి ఆపై అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసుపై మాజీ మంత్రిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం త్రిపుర ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జమతియ అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామని ఢిల్లీలోని త్రిపుర భవన్ జాయింట్ రెసిడెంట్ కమిషనర్ రంజిత్ దాస్ వెల్లడించారు. రాజధాని ఢిల్లీలో చదువుకుంటున్న త్రిపుర విద్యార్ధిని స్టేట్మెంట్ను ఢిల్లీ పోలీసులు రికార్డు చేసి, మాజీ మంత్రిని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.