National Commission for Women has issued notices to MLC Kaushik Reddy
mictv telugu

గవర్నర్ తమిళిసైపై వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి నోటీసులు

February 19, 2023

National Commission for Women has issued notices to MLC Kaushik Reddy

తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించకపోవడంతో మొదలైన ఈ గొడవ.. గవర్నర్ ప్రతీ పర్యటనపై పడింది. సమ్మక్క సారక్క, భద్రాచలం ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కూడా ప్రతివిమర్శలకు దారి తీసింది. ఈ క్రమంలో గవర్నర్‌పై పాడి కౌశిక్ తీవ్ర పదజాలంతో విమర్శించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన వద్ద పెట్టుకొని ఒక్క ఫైల్ కూడా కదలనివ్వడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.