జావెలిన్ త్రోయర్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నీరజ్ చోప్రా మరో కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక డైమెండ్ లీగ్ టైటిల్ను గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. డైమెండ్ లీగ్లో తన సత్తా చాటాడు. తొలి త్రోను ఫౌల్గా ప్రారంభించినా చోప్రా..ఆ తర్వాత 88.44 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి, డైమెండ్ లీగ్ టైటిల్ను చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్రయత్నాల్లో జావెలిన్ను 88.00 మీ, 86.11మీ, 87.00మీ, 83.60 మీటర్ల దూరం విసిరాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకడ్ 86.94 మీటర్ల దూరం విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని‘ Athletics Federation of India’ ట్విటర్ వేదికగా తెలియజేసింది.
Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩
Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw.
FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝
X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3
— Athletics Federation of India (@afiindia) September 8, 2022
”టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ ఇండియన్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సిల్వర్, డైమండ్ లీగ్లోనూ చాంపియన్గా నిలిచాడు. గడిచిన 13 నెలల్లోనే నీరజ్ చోప్రా అంతర్జాతీయ క్రీడా పోటీల్లో తన ట్యాలెంట్ను ప్రదర్శించాడు. ఆగస్టు 17న టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో అతను గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సీజన్లో 88 మీటర్ల కన్నా ఎక్కువ దూరం ఆరుసార్లు విసిరాడు.”
నీరజ్ చోప్రా విషయానికొస్తే…2013లో మొదటిసారిగా అంతర్జాతీయ పోటీలో పాల్గొన్నాడు. ఉక్రెయిన్లో జరిగిన వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో ప్రవేశించాడు. ఆ తర్వాత 2014లో తన మొదటి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2016లో అతను 86.48 మీటర్ల ప్రపంచ అండర్ -20 రికార్డు త్రోను సాధించాడు. దీంతో ప్రపంచ రికార్డు సృష్టించిన మొదటి భారతీయ అథ్లెట్గా నిలిచాడు. తాజాగా గురువారం జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్లో 88.44 మీటర్లు విసిరి, అగ్రస్థానంలో నిలిచాడు.