పొరుగునున్న సరిహద్దు దేశం నేపాల్ 16 భారత కంపెనీల ఔషధ దిగుమతులపై నిషేధం విధించింది. ఆయా కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించింది. ప్రస్తుతానికి భారత్ కి చెందిన కొన్ని కంపెనీలు మాత్రమే అనుమతి పొందాయని, చాలా కొత్త కంపెనీలు అనుమతి కోసం వేచి చూస్తున్నాయని వెల్లడించింది. బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో రాందేవ్ బాబాకి చెందిన దివ్య ఫార్మసీ, జైడస్ లైఫ్ సైన్సెస్ లు కూడా ఉన్నాయి. వీటితో పాటు రేడియంట్ పేరెంటరల్స్, అలయన్స్ బయోటెక్, పాప్టాబ్ బయోటెక్, జీఎల్ఎస్ ఫార్మా, మెర్క్యురీ ల్యాబొరేటరీస్, ఆగ్లోమెడ్, జీ ల్యాబొరేటరీస్, డాఫోడిల్స్ ఫార్మాస్యుటికల్స్, యూనిజూల్స్ లైఫ్ సైన్సెస్, శ్రీ ఆనంద్ లైఫ్ సైన్సెస్, కాన్సెప్ట్ ఫార్మాస్యుటికల్స్, మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్, దయాళ్ ఫార్మాస్యూటికల్స్, మాక్యూర్ ల్యాబొరేటరీస్ లను బ్లాక్ లిస్టులో ఉంచామని నేపాల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ సీనియర్ అధికారి కేసీ సంతోష్ వెల్లడించారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని, ఆయా కంపెనీలు మరోసారి దరఖాస్తు చేసుకుంటే అనుమతులపై పున పరిశీలిస్తామని తెలిపారు.