తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఆదివారం కొత్తగా 948 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,23,059కు చేరింది.
Telugu : Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 19.10.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/sVploR49mF
— Eatala Rajender (@Eatala_Rajender) October 19, 2020
కరోనాతో నిన్న ఒక్క రోజే నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,275కి చేరింది. నిన్న కొత్తగా 1,896 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,00,686కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,098 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక పరీక్షల విషయానికి వస్తే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 26,027 కరోనా వైరస్ టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 38,56,530 టెస్టులు చేశారు.