తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి తక్కువ నమోదైన కేసులు తాజాగా మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 837 కొత్త పాజిటివ్ కేసులు, నాలుగు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. అలాగే సోమవారం రోజున 1,554 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 27.10.2020)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline pic.twitter.com/r5d79lCmyZ
— Dr G Srinivasa Rao (@drgsrao) October 27, 2020
ఇప్పటివరకు 2,13,466 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,32,671కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 14,851 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1315మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 91.40% శాతంగా ఉంది. రాష్ట్రంలో నిన్న 21099 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 41,15,516 పరీక్షలు చేసారు.