తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తక్కువగా నమోదైన కేసులు తాజాగా మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,445 కొత్త పాజిటివ్ కేసులు, ఆరు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. అలాగే శుక్రవారం రోజున 1,486 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 31.10.2020)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline pic.twitter.com/xYv0Bt7lW9
— Dr G Srinivasa Rao (@drgsrao) October 31, 2020
ఇప్పటివరకు 2,18,887 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,38,632కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,409 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 15,439 మంది హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1336మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 91.40% శాతంగా ఉంది. రాష్ట్రంలో నిన్న 41,243 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 42,81,991 పరీక్షలు చేసారు.