తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ 50 కిలోల విభాగంలో గురువారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటింది. ఇప్పటికే వరుస మ్యాచ్లు గెలుస్తూ వస్తున్న ఆమె.. క్వార్టర్ ఫైనల్స్కు చేరింది. పతకం ఖాయం అయ్యే మ్యాచ్లో వేల్స్కు చెందిన హెలెన్ జోన్స్ను మట్టి కరిపించి, సెమీఫైనల్కు చేరింది. త్వరలోనే జరగబోయే ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే, భారత్ ఖాతాలోకి మరో పతకం వచ్చి చేరుతుందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ట్విటర్ ఖాతాలో ఆశాభావం వ్యక్తం చేశారు.
Indian Pride #NikhatZareen Confirms Medal! 🥊
World Champion @nikhat_zareen defeated Helen Jones of Wales via Unanimous Decision in the Women’s 50kg Quarterfinals at @birminghamcg22#CWG2022 #Cheer4India #India4CWG2022 @KTRTRS @TelanganaCMO @ntdailyonline @TelanganaToday pic.twitter.com/ZdeErrffic
— V Srinivas Goud (@VSrinivasGoud) August 4, 2022
గతకొన్ని రోజులుగా బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గేమ్స్లో ఇప్పటికే భారత్ ఖాతాలోకి భారీగా పతకాలు వచ్చి చేరాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో పతకం ఖాయమైపోయింది. తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ 50 కిలోల విభాగంలో గురువారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్లో విన్నర్గా నిలిచి, సెమీఫైనల్కు చేరింది. దీంతో ఫైనల్లో కూడా ఆమెనే కచ్చితంగా గెలుస్తుందని భారతీయ క్రీడాకారులు అంచనా వేస్తున్నారు.
నిఖత్ జరీన్..ఇటీవలే వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్లోనూ ఆమె సత్తా చాటుతోంది. ఇప్పటికే వరుస మ్యాచ్లు గెలుస్తూ క్వార్టర్ ఫైనల్స్ చేరిన జరీన్..నిన్న జరిగిన మ్యాచ్లో వేల్స్కు చెందిన హెలెన్ జోన్స్ను మట్టి కరిపిచడంతో భారత్కు మరో పతకం రావడం ఖాయమని అంచనాలు పెరిగిపోయాయి.