5.7 కోట్ల మంది భారతీయులు తీవ్రమైన శిలీంద్ర వ్యాధులతో (ఫంగల్ ఇన్ఫెక్షన్స్) బాధపడుతున్నారు. 400 పరిశోధన కథనాల సమీక్ష ప్రకారం.. వీరిలో 10శాతం మంది ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లు వచ్చినవారని తేలింది.
భారతదేశంలో శిలీంద్ర వ్యాధి తరుచుగా ఉంటుంది. కానీ దాని సంభవం, వ్యాప్తి అస్పష్టంగా ఉంది. ఈ సమీక్ష దేశంలోని వివిధ ఫంగల్ ఇన్ఫెక్షన్ల ఫ్రీక్వెన్సీ లేదా భారాన్ని నిర్వచించింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పశ్చిమ బెంగాల్, ఎయిమ్స్ కల్యాణి, పీజ్మెర్, చండీగఢ్లోని పరిశోధకులు, యూకేలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంతో పాటు.. 5.7 కోట్లకు పైగా లేదా భారతదేశ జనాభాలో 4.4శాతం మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
‘భారతదేశంలో క్షయవ్యాధి సంవత్సరానికి మూడు మిలియన్ల కంటే తక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. అయితే ఫంగల్ వ్యాధి బారిన పడిన భారతీయుల సంఖ్య చాలా రెట్లు ఎక్కువ. కాకపోతే శిలీంద్ర వ్యాధుల కారణంగా మొత్తం భారం చాలా పెద్ది. కానీ తక్కువ అంచనా వేయబడింది’ అని ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన అనిమేష్ రే అన్నారు.
ఇన్ఫెక్షన్ల గురించి..
జర్నల్ ఓపెన్ ఫోరమ్ ఇన్ఫెక్షియస్ డీసెజెస్లో ప్రచురించబడిన సమీక్షలో.. పునరావృతమయ్యే దాడులతో దాదాపు 2.4 కోట్ల మంది పునరుత్పత్తి వ్యాధితో స్త్రీలు బాధపడుతున్నట్లు చెబుతుననది. ఇక హెయిర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని టినియా క్యాపిటిస్ అని పిలుస్తారు. పాఠశాల వయసు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల జుట్టు రాలిపోవడం ఎక్కువ అవుతుందని ఒక అధ్యయనం చెబుతున్నది. ఊపిరితిత్తులు, సైనస్ లకు సంబంధఇంచిన ఇన్ఫెక్షన్లతో 2.5లక్షల మంది పై ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు తెలిపారు. శ్వాసకోశ సమస్యలతో 35 లక్షల మంది బాధపడుతున్నట్లు మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 10 లక్షల మంది కంటి వ్యాధులతో బాధపడుతున్నారు.
ఆరోగ్యానికి ముప్పు..
యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, గ్లోబల్ యాక్షన్ ఫర్ ఫంగల్ డిసీజ్ నుంచి ప్రొఫెసర్ డేవిడ్ డెన్సింగ్ ఇటీవలి సంవత్సరాల్లో రోగనిర్ధారణ మెరుగుదలలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రజారోగ్య సేవలు, సామర్థ్యపరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ఉన్నాయని తెలిపింది. ‘ఫంగల్ వ్యాధి ప్రజారోగ్యానికి ముప్పుగా కొనసాగుతున్నది. వాటి ద్వారా సోకిన వారికి గణనీయమైన సామాజిక ఆర్థిక భారాన్ని సూచించే ముఖ్యమైన అనారోగ్యం, మరణాలకు కారణం. పిల్లల్లో హిస్టోప్లాస్మోసిస్, ఫంగల్ ఆస్తమా వంటి కొన్ని ముఖ్యమైన వ్యాధులను అంచనా వేయడంలో విఫలమవుతున్నాం’ అంటున్నారు డాక్టర్ డెన్నింగ్.