Home > Featured > భారత్ లాగానే ట్రై చేసి..పరువు పోగొట్టుకున్న పాక్ రేడియో!

భారత్ లాగానే ట్రై చేసి..పరువు పోగొట్టుకున్న పాక్ రేడియో!

Pakistan's Radio Broadcaster Goofs up Weather Report on Ladakh

భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇకపై పీవోకే ప్రాంతాల్లోనూ వాతావరణ సూచనలు జారీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం పాక్‌ ఆధీనంలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేయనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. ఈ చర్య ద్వారా కశ్మీర్ మొత్తం భారత్‌కు చెందినదేనంటూ మరోసారి స్పష్టం చేసింది.

భారత్ చర్యకు దీటుగా జవాబిద్దామనే తొందరలో పాకిస్థాన్ రేడియో పరువు పోగొట్టుకుంది. ఆ సంస్థ ఇటీవల చేసిన ట్వీట్‌లో దొర్లిన పొరపాటు కారణంగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పాక్ రేడియో లడాఖ్ లోని గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల సమాచారాన్ని ట్వీట్ చేసింది. గరిష్ట ఉష్ణ్రోగ్రత -4 డిగ్రీలని, కనిష్ట ఉష్ణోగ్రత -1 డిగ్రీలని ట్వీట్ లో పేర్కొంది. అయితే గణిత శాస్త్రం ప్రకారం పెద్ద సంఖ్య అయిన -1ని కనిష్ట ఉష్ణోగ్రతగా పేర్కనడాన్ని నెటిజన్లు గుర్తించారు. దీంతో పాక్‌ రేడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పాకిస్తాన్ రేడియో సంస్థ ఆ ట్వీట్ ను తొలగించింది. అయితే అప్పటికే ఆ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Updated : 11 May 2020 10:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top