పాన్ కార్డు-ఆధార్కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం వినియోగదారులను ఇప్పటికే పలుసార్లు అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా పాన్, ఆధార్ లింక్ పై కేంద్రం పలుసార్లు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత గడువును మరోసారి పెంచేది లేదని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్తో లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లదని స్పష్టంచేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి పాన్ రద్దవుతుందని తెలిపింది. పాన్-ఆధార్ లింక్ లేని వాళ్లు నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించింది.
‘ఐటీ యాక్ట్,1961’ ప్రకారం ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అని సూచించింది. నోటిఫికేషన్ నెం.37/2017 ప్రకారం.. పన్ను మినహాయింపు పరిధిలోకి రానివాళ్లు కూడా నిర్ణీత గడువులోగా ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ గతంలోనే సూచించింది. అంటే అసోం, మేఘాలయ, జమ్ము-కాశ్మీర్ ప్రాంతాల్లో నివసించే వాళ్లు, నానె రెసిడెంట్స్, 80 ఏళ్లు దాటిన వాళ్లు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తారు. ఐటీ శాఖ్ వెబ్సైట్ ద్వారా ఆధార్ లింక్ చేసుకోవడం చాలా సులభం. గతంలోనే ఆధార్ లింక్ చేసుకునేందుకు ఐటీ శాఖ గడువిచ్చింది. ఆ తర్వాత రూ.500 అపరాధ రుసుముతో జూన్ 30 వరకు గడువిచ్చింది. అనంతరం జూలై 1 నుంచి వెయ్యి రూపాయల అపరాధ రుసుము చెల్లించి, పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పించింది ఐటీ శాఖ. ఈ గడువు వచ్చే మార్చితో పూర్తవుంది. అది కూడా పూర్తైతే పాన్ నిరుపయోగం అవుతుంది. ఆధార్ లింక్ లేకుండా ఐటీ రిటర్న్ దాఖలు చేసే అవకాశం లేదు. అలాగే ఐటీ శాఖ రీఫండ్స్ కూడా చేయదు. అదనపు పన్నులు కూడా వసూలు చేస్తారు.
ఇలా లింక్ చేయండి
• ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయడానికి మొదట ఆదాయపు పన్ను(ఐటీ) అధికారిక వెబ్సైట్కి వెళ్లి.. ఆపై ఆధార్ కార్డ్లో ఇచ్చిన పేరు, పాన్ నంబర్, ఆధార్ నంబర్ను నమోదు చేయాలి.
• దీని తర్వాత, ఆధార్ కార్డులో ఇచ్చిన పుట్టిన సంవత్సరానికి టిక్ చేయండి.
• క్యాప్చా కోడ్ను నమోదు చేసి, ఆపై లింక్ మద్దతు బటన్పై క్లిక్ చేయండి.
• దీని తర్వాత మీ పాన్ నంబర్ ఆధార్తో లింక్ చేయబడుతుంది.