Pay Rs.8 lakhs every month..Court order to film actor
mictv telugu

ప్రతి నెల రూ.8 లక్షలు చెల్లించండి..సినీ నటుడుకి కోర్టు ఆదేశం

October 1, 2022

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్‌ అంటే తెలియని వారుండరు. ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే డైలాగుతో పృథ్వీరాజ్‌ ప్రేక్షకుల మదిలో ఎప్పటికి చేరిగిపోని కామెడియన్‌గా ముద్ర వేసుకున్నారు. అయితే, తాజాగా విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (ఫ్యామిలీ కోర్టు) నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ, తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి, పృధ్వీరాజ్ (శేషు)తో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, ఓ కుమారుడు జన్మించారు. అయితే, పృథ్వీరాజ్ విజయవాడలో మామగారి ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి, సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడు. ఆ ఖర్చులన్నీ అత్తగారు వారే భరించేవారు. గతకొన్ని రోజుల తర్వాత ఆయన తన భార్యను తరచూ వేధిస్తూ భార్య లక్ష్మిని 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి గెంటివేశాడు.

దాంతో ఆమె 10 జనవరి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. దాంతో కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి పృథ్వీరాజ్..తన భార్యకు నెలకు రూ. 8 లక్షలు, ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇవ్వాలని, అది కూడా ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని ఆదేశించారు.