RRR టీమ్కు భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. నాటు నాటు సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సందర్భంగా.. ప్రతీ భారతీయుడు గర్వించేలా చేశారని ప్రశంసించారు ప్రధాని. ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలిపారు. ‘‘ చాలా ప్రత్యేకం..ఎంఎం కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ లకు అభినందనలు. ఎస్ఎస్ రాజమౌళి, తారక్, రామ్ చరణ్, ట్రిపుల్ ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు’’ తెలుపుతూ ట్వీట్ చేశారు. అవార్డ్ వీడియోను షేర్ చేశారు.
A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE
— Narendra Modi (@narendramodi) January 11, 2023
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఆర్.ఆర్.ఆర్. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. “నాటు.. నాటు..” గీతానికి ప్రపంచ ఖ్యాతి దక్కటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ గీతానికి గాను ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి సహా ఆర్.ఆర్.ఆర్. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
ఏపీ ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు జగన్, చంద్రబాబు లు కూడా మూవీ టీమ్కి అభినందనలు తెలిపారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ తో పాటు హిందీ, కన్నడ, మళయాళ, తమిళ భాషల్లో గుర్తింపు పొందింది. ముఖ్యంగా విదేశాల్లో నాటు నాటు పాట చాలా ఫేమస్ అయింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్ గన్, శ్రియ, అలియాభట్ ఇతర పాత్రలు పోషించారు.