ప్రధాని మోదీ గురువారం గుజరాత్లోని బరూచ్లో జరిగిన ఉత్కర్ష్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజలతో మమేకం అవుతూ.. దృష్టి లోపం ఉన్న యాకూబ్ పటేల్ అనే వ్యక్తితో మాట్లాడారు. ‘దృష్టిలోపం ఎందుకు వచ్చింది? డాక్టర్లు ఏమన్నారు? అంటూ మీ కుమార్తెలను చదివిస్తున్నారా’? అని ప్రశ్నించారు. దానికి యాకూబ్ ‘నాకు ముగ్గురు కుమార్తెలు. ఒకరు 12, ఇంకొకరు 8, మరొకరు 1 వ తరగతి చదువుతున్నారు. పెద్ద కూతురు డాక్టర్ కావాలని ఆశపడుతుంది’ అని చెప్పగా ప్రధాని ‘పక్కన మీ పెద్ద కూతురు ఉందా’ అని అడిగారు.
అక్కడే కూర్చున్న పెద్ద కూతురు అలియా లేవగా ఆమెను మోదీ ‘డాక్టర్ వృత్తిని ఎందుకు ఎంచుకోవాలని అనుకుంటున్నావు? అని ప్రశ్నించగా, ‘మా నాన్న దృష్టి లోపం కారణంగా డాక్టరు కావాలనుకుంటున్నాను’ అని బదులిచ్చింది. దాంతో మోదీ కాసేపు మౌనం దాల్చి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అలియాకు విషెష్ చెప్తూ తిరిగి ‘రంజాన్ ఎలా జరుపుకున్నారు యాకూబ్? పిల్లలకు పండుగకు ఏం కొనిచ్చారు? అని బట్టలు కొనిచ్చానని యాకూబ్ చెప్పాడు. వ్యాక్సిన్ గురించి ఆరా తీయగా తమ కుటుంబం అంతా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు తెలిపాడు. చివరగా పిల్లలను మంచిగా చదివించి వారి కలలను సాకారం చేయాలని సూచించారు.
#WATCH | While talking to Ayub Patel, one of the beneficiaries of govt schemes in Gujarat during an event, PM Modi gets emotional after hearing about his daughter's dream of becoming a doctor & said, "Let me know if you need any help to fulfill the dream of your daughters" pic.twitter.com/YuuVpcXPiy
— ANI (@ANI) May 12, 2022