PM Modi to release PM Kisan funds on February 27
mictv telugu

రైతుల అకౌంటులో మోదీ పైసలు.. డేట్ వచ్చేసింది

February 25, 2023

PM Modi to release PM Kisan funds on February 27

రైతుల కోసం కేంద్రం అందిస్తున్న పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13 విడత డబ్బులను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధిని విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోమవారం అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఈ విడత ద్వారా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు విడుదల అవుతాయని అంచనా. ఇక ఈ – కేవైసీ చేసిన రైతుల ఖాతాల్లోకే డబ్బులు వస్తాయని తెలిసిందే. ఇంతకుముందే ప్రభుత్వం ఈ – కేవైసీ చేయించుకోవాలని రైతులకు సూచించింది. అయితే ఈ – కేవైసీ వచ్చిన నాటి నుంచి లబ్దిదారుల సంఖ్య తగ్గడం గమనార్హం.