ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్తాన్ నైసర్గికంగానూ పతనమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సరిహద్దును ఆక్రమించిన ఆఫ్ఘాన్ తాలిబాన్లు త్వరలోనే పాక్పై పట్టుసాధిస్తామంటున్నారు. మరోపక్క.. పాక్ ఆక్రమించిన కశ్మీర్ (పీఓకే) ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ చేతిలో తాము సర్వనాశనమయ్యామని, వెంటనే గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని భారతదేశంలో కలపాలని కొన్ని రోజులుగా భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Ppl in #GilgitBaltistan chant slogans for REUNIFICATION with #Ladakh & demand opening of #Kargil – #Skardu road. Ppl always resisted #Pakistani moves to make #POJK a province of #Pakistan, but #India has always accommodated Pakistan on #JammuAndKashmir ignoring public sentiments. pic.twitter.com/a5x66Qf1nx
— Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 7, 2023
‘‘పాకిస్తాన్ పాలకులు మా ప్రాంతంలోని సహజ వనరులను కొల్లగొట్టి సింధ్, పంజాబ్ ప్రాంతాలకు దోచిపెడుతున్నారు. మాకు ఉద్యోగాలు లేవు. కనీస సదుపాయాలు లేవు. మేం బతికేదెలా? మాకు జీవనాడి అయిన కార్గిల్ మార్గాన్ని తిరిగి తెరవాలి. మమ్మల్ని భారత్ లోని లద్దాఖ్లో కలిపేయాలి. మా బతుకులు బాగుపడాలంటే అంతకుమించిన మార్గం లేదు’’ అని అంటున్నారు. వేలమంది వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. పాక్ తేలుకుట్టిన దొంగలా దీనిపై ఏమాత్రం స్పందించడం లేదు.