Home > Featured > మరికాసేపట్లో భద్రాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మరికాసేపట్లో భద్రాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

president draupadi murmu will visit bhadradri ramappa temple today

శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాద్రి, రామప్ప ఆలయాలను సందర్శించనున్నారు. మొదట భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామిని, ఆ తర్వాత రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో భద్రాచలంలో బుధవారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. భద్రతా కారణాలతో భద్రాచలం రామవారధిపై ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాకపోకలు నిషేధించారు. భద్రాచలం, సారపాకల్లో 144 సెక్షన్ విధించి స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

రాష్ట్రపతి పర్యటన ఇలా..
ఈ ఉదయం హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌బేస్‌ నుంచి ప్రయాణమైన రాష్ట్రపతి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి 9:50 గంటలకు భద్రాచలం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 10:15 నుంచి 10:30 వరకు భద్రాచలం రామాలయంలో రాములోరి దర్శనం చేసుకుని ప్రసాద్‌ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ జంజతి సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం బైపాస్‌ రోడ్‌లో వీరభద్రకళ్యాణ మండపం వద్ద జరిగే వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:40 గంటలకి తిరిగి ఐటీసీ గెస్ట్‌హౌస్‌కి చేరుకుంటారు. 13:35 గంటలకు తిరిగి ములుగు జిల్లా రామప్ప టెంపుల్‌కు వెళ్లనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళసై కూడా రాష్ట్రపతితో పాటు రానున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Updated : 27 Dec 2022 10:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top