వరుస ప్లాప్లతో సతమతమవుతోన్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్..‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో సెప్టెంబర్ 28న తన పుట్టినరోజు సందర్భంగా దర్శకత్వ విభాగంలో 30 మంది సభ్యులకు 50 వేల చొప్పున 15 లక్షలు సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడికి రూ.50వేల ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’కు దర్శకత్వం వహించిన గూడపాటి రాజ్కుమార్ ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడి వైద్య ఖర్చులకు కూడా భారమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. కాశీవిశ్వనాథ్ రూ.5 వేలు, మెహర్ రమేష్ రూ.10 వేల చొప్పున ఆయనకు ఆర్థిక సహాయం అందించారు. ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సురేష్రెడ్డి రూ.41వేలు అందజేయాగా.. ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్కుమార్ రూ.25 వేల నగదు అందజేశారు. బుధవారం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూ.50 వేలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. దీంతో ‘దటీజ్ పూరి’ అంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు. సినీ ప్రముఖు చేస్తున్న సహాయానికి రాజ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.