అలనాటి ‘రామాయణ్’ సీరియల్లో రావణ పాత్రలో నటించిన అరవింద్ త్రివేది లంకేశ్(82) మరణించారని గత కొని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అరవింద్ మరణించారని ఎందరో నెటిజన్లు సోషల్ మీడియాలో నివాళ్లు తెలియజేస్తున్నారు. ఈ విషయం అరవింద్ కుటుంబానికి తెల్సింది. దీంతో వాళ్ళు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అరవింద్ మేనల్లుడు దీనిపై స్పందించారు.
Dear all my uncle Arvind Trivedi lankesh is all good and safe. Stop spreading fake news it is request. Now please spread this. Thanks pic.twitter.com/XvmGnCPNy5
— Kaustubh b trivedi (@KaustubhbB) May 3, 2020
అరవింద్ మరణించినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన మేనల్లుడు కౌస్తుభ్ ట్విట్టర్ లో తెలిపారు. ‘మా అంకుల్ అరవింద్ త్రివేది లంకేశ్ క్షేమంగా ఉన్నారు. దయచేసి ఆయనపై అసత్య ప్రచారం చేయకండి. ఆయన బతికే ఉన్నారన్న సమాచారాన్ని అందరికీ తెలియజేస్తున్న’ అని కౌస్తుభ్ ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ కారణంగా అలనాటి ‘రామాయణ్’ సీరియల్ పునః ప్రసారం అవుతున్న సంగతి తెల్సిందే. మార్చి 28 నుంచి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్(దూరదర్శన్) చానల్లో దీన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ సీరియల్ లో రావణాసురుడి పాత్రలో అరవింద్ త్రివేది నటించారు. అరవింద్ కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్ను టీవీలో వీక్షించారు. సీతాపహరణ సన్నివేశం చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. నేను తప్పు చేశాననని, సీతను కిడ్నాప్ చేసినందుకు క్షమించాలని ప్రజలను కోరారు.