రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమేజాన్ కు భారీ జరిమానా విధించింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో అమేజాన్ కు రూ.3.06కోట్ల జరిమానాను విధించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్, కేవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ వేసినట్లు తెలిపింది. ఇప్పటికే ఆర్బీఐ అమేజాన్ కు షోకాజ్ నోటీసులు పంపించింది. జరిమాను ఎందుకు విధంచకూడదు అనే దానిపై సరైన కారణం చూపాలని సూచించింది. ఎంటిటీ రెస్పాన్స్ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించడం లేదన్న అభియోగం రుజువైందని పేర్కొంది. అదేవిధంగా కస్టమర్ల లావాదేవీలకు పెనాల్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెజాన్ పే అనేది ఇ-కామర్స్ దిగ్గజం. అమెజాన్ యొక్క డిజిటల్ చెల్లింపు విభాగం. అయితే డిజిటల్ చెల్లింపుల విషయంలో ఫోన్ పే, గూగుల్ పేలు అత్యుత్తమ సేవలను అందిస్తూ మొదటిస్థానంలో కొనసాగుతున్నాయి. అమేజాన్ పే మాత్రం కేవలం 1 శాతంలోపే ఉండటం గమనించాల్సిన విషయం.