ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చిన వేళ.. దేశమంతా సంబురపడుతోంది. ఈ సినిమా బృందానికి, మరీ ముఖ్యంగా దర్శకుడు రాజమౌళికి రాజకీయ, సినీ ప్రముఖులే కాకుండా అన్నిరంగాల వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సినిమా రిలీజ్కు ముందు చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సినిమాకు ముందు బీజేపీ శ్రేణులు ఈ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేశారు. రాజమౌళికి వార్నింగులు ఇస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు.. వాళ్లంతా అదే సినిమా టీం సాధించిన ఘనతకు సాహో అంటూ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో.. అప్పడు వాళ్లు అన్న మాటలను సీరియస్గా తీసుకున్న కొందరు మాత్రం.. ఇప్పుడు ఆ వీడియోతో ట్రోల్స్ చేస్తున్నారు.
Congratulations and best wishes to team @RRRMovie for clinching the best original song #NaatuNaatu at #Oscars . This moment is historic for Indian cinema and particularly for Telugu people. Proud of @Rahulsipligunj for his performance today which truly deserved standing ovation pic.twitter.com/4ICLiSMLNT
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 13, 2023
గతంలో ఆర్ఆర్ఆర్ మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డైరెక్టర్ రాజమౌళిని ఉద్దేశించి… బిడ్డ నువ్వు కనక సినిమా రిలీజ్ చేస్తే బరిసెలతో కొట్టి కొట్టి చంపుతాం, ఉరికిచ్చి కొడతాం. ప్రతీ సినిమా థియేటర్ను కాలపెడతం.. అని బండి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మళ్లీ షేర్ చేస్తున్న నెటిజన్లు.. ఇలాంటి చిల్లర పాలిటిక్స్ మానుకోవాలని హెచ్చరించారు.
Congratulations to team @RRRMovie on winning the prestigious Oscar award for the song #NaatuNaatu written by @boselyricist
And this is the right time to remember what kind of venom bigots like @bandisanjay_bjp spewed on this movie.
Let's reject such hatemongers! pic.twitter.com/hAthO0MlyG
— Konatham Dileep (@KonathamDileep) March 13, 2023
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి వ్యక్తి బండి సంజయ్ అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. బండి సంజయ్ చేసిన ట్వీట్ ను కొందరు రీట్వీట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి బెదిరింపు రాజకాయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఆస్కార్ వచ్చింది కాబట్టి డాల్బీ థియేటర్ కూడా తగులబెడతావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ వైఖరిని నిరసిస్తూ నెటిజన్స్ రియాక్ట్ అవుతుండటంతో ట్రెండింగ్ గా మారింది. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం పట్ల భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.