టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న సినిమాలో ధావన్ కీలక పాత్ర పోషిస్తున్నారట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందట. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ చిత్రం పేరు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
శిఖర్ ధావన్కు బాలీవుడ్ హీరోలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. గతేడాది అక్టోబర్లో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రామసేతు సినిమా సెట్లో కన్పించాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను కలిసిన ఫొటోలను గత ఏడాది డిసెంబర్లో షేర్ చేశాడు ధావన్. చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నాడు. అప్పుడు విడుదలైన ’83’ సినిమా అద్భుతంగా ఉందని, సినిమా హిట్ అయినందుకు రణ్వీర్కు అభినందనలు తెలిపాడు.