తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా 538 కేంద్రాల్లో ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి ఈ క్రింది సూచనలు తప్పకుండా పాటించాలని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
1. ఎస్సై ప్రిలిమ్స్ హాల్టికెట్ను ఏ4 సైజ్లో రెండు వైపులా ప్రింట్ అవుట్ను తీసుకోవాలి.
2. కలర్లో ప్రింట్ అవుట్ అవసరం లేదు.
3. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలి.
4. పిన్నులతో, గుండు పిన్నులతో ఫొటోలు పెట్టొద్దు.
5. పాస్పోర్ట్ సైజు ఫొటో దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసినలాంటిదే ఉండాలి.
6. ఫొటో అతికించని అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
7. పరీక్షను బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నుతో రాయొచ్చు.
8. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటారు.
9. అభ్యర్థులు చేతులకు మెహందీ, టెంపరరీ టాటూలు పెట్టుకోకూడదు.
10. అభ్యర్థులు మొబైల్స్, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, రిస్ట్వాచ్, వ్యాలెట్, విడి కాగితాలు వెంట తీసుకురావొద్దు.
మరోపక్క అధికారులు ఆదివారం ఉదయం నిర్వహించనున్న ఎస్సై పరీక్షకు హైదరాబాద్ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో 503, ఇతర పట్టణాల్లో 35 కలిపి మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలతో హాల్టికెట్ల డౌన్లోడ్ గడువు ముగిసింది.