నేటి కాలంలో ప్రతి పదిమందిలో ఐదుగురు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇది మేము చెబుతున్నది కాదు..కొన్ని నివేదికలు ఇప్పటికే వెల్లడించిన వాస్తవం. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే స్థూలకాయానికి కారణం. అయితే చాలామంది అధిక బరువును తగ్గించుకునేందుకు డైటింగ్, ఫాస్టింగ్ పద్దతిని ఫాలో అవుతుంటారు. వాస్తవానికి మీరు దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో కొన్ని రోజుల తర్వాత అర్థం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవును ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంతోపాటు మనస్సుపై కూడా ప్రభావం చూపుతుంది. శారీరకంగా బలహీతన ఉన్నచోట మానసికంగా వ్యక్తి చిరాకకు పడుతుంటాడు. కాబట్టి బరువు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా రాత్రిపూట భోజనాన్ని మానేయకూడదు. తేలికపాటి ఆహారం తీసుకవోాలి. రాత్రి భోజనం చేయకపోయినట్లయితే ఎలాంటి నష్టాలను ఎదుర్కోవల్సి వస్తుందో ఓసారి చూద్దాం.
కడుపు నొప్పి సమస్య :
రాత్రిపూట ఆహారం తీసుకోని వారు తరుచుగా కడుపునొప్పితో బాధపడుతుంటారు. కొన్నిసార్లు ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి రాత్రి భోజనం చేయకపోవడం కంటే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఒక కాయధాన్యాలు లేదా ఉడికించిన కూరగాయలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి.
బలహీనత రావచ్చు:
ఒకటి లేదా రెండు రోజులు పాటు రాత్రి పూట భోజనం చేయడం మానేస్తే…ఎలా తేడా కనిపించదు. కానీ రోజూ రాత్రి పూట భోజనం చేయడం మానేస్తే బలహీనత ఏర్పడుతుంది. ఊబకాయం లేదా బరువు తగ్గించుకోవాల్సిన వ్యక్తులు మాత్రమే రాత్రిభోజనం మానేస్తారు. డిన్నర్తో పాటు చాలా సార్లు అల్పాహారాన్ని కూడా మానేస్తారు. ఈ చక్రంలో శరీరం బలహీనంగా మారుతుంది. మీ ఈ అలవాటు మీ శారీరక మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
నిద్ర సమస్యలు పెరగవచ్చు
వీటన్నింటితో పాటు రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా నిద్ర రాకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే రాత్రి పురోగమిస్తున్న కొద్దీ, ఆకలి ఎక్కువగా అవుతుంది. దీని కారణంగా చాలా సార్లు తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నిద్ర ఉండదు. నిద్రలేమి కారణంగా ఎన్నో రోగాలు చుట్టుముడుతుంటాయి.
కాబట్టి రాత్రిపూట తేలికపాటి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యంతోపాటు అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. బరువు పెరుగుతున్నామని తినడం మానేస్తే ఉన్న రోగాల కంటే లేని రోగాలను కొని తెచ్చుుకున్నట్లు అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.