జాతీయ గీతాన్ని అన్ని సినిమా థియేటర్లలో సినిమాకు ముందు ప్రదర్శించాలని, ఆ టైమ్ లో నిల్చోవాలని సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించింది. ఇప్పుడు జాతీయ గేయం వందేమాతారాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు , విద్యాలయాల్లో తప్పనిసరిగా పాడాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.ఎందుకంటే..
తమిళనాడులోని అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాల్లో జాతీయ గేయం `వందేమాతరం` తప్పనిసరిగా పాడాలని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. దేశంలోని ప్రతి పౌరుడు దేశాభిమానం చూపించడం అవసరమని, కనీసం వారానికి రెండు సార్లైన అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంబంధ కార్యాలయాల్లో `వందేమాతరం` ఆలపించాలని సూచించింది. ముఖ్యంగా సోమవారం, శుక్రవారం తప్పనిసరిగా ఆలపించాలని ఆర్డరేసింది. అన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, పరిశ్రమలు, సంస్థలు కనీసం నెలకు ఒకసారైన జాతీయగేయం పాడాలని ఆదేశించింది. ఎవరికైనా పాడటానికి ఇబ్బంది అనిపించి, సరైన కారణం చూపించగలిగితే వారికి మినహాయింపు ఇవ్వొచ్చని కోర్టు అంది. ఇదే ఆదేశాన్ని దేశవ్యాప్తం చేసే పిటిషన్పై ఆగస్టు 25న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.