సింగరేణి కరోనా సాయం రూ. 40 కోట్లు
Editor | 6 May 2020 8:03 AM GMT
కరోనా వైరస్ పై పోరుకి ఎందరో దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇటీవల లలితా జ్యువెల్లర్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం అందించిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించిన చెక్కును లలిత జ్యువెల్లర్స్ సిఎండి డాక్టర్ ఎం కిరణ్ కుమార్ సీఎం కేసీఆర్కు అందించారు. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా చెరో కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు.
తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించింది. సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి చెక్కును అందించారు. సీఎం కేసీఆర్ విరాళమిచ్చిన ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు.
Updated : 6 May 2020 8:03 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire