Home > Featured > కేసీఆర్ ఇంట పండుగ సందడి.. రాఖీ కట్టిన నలుగురు సిస్టర్స్

కేసీఆర్ ఇంట పండుగ సందడి.. రాఖీ కట్టిన నలుగురు సిస్టర్స్

Sisters tied rakhis to KCR in pragathi bhavan

రాఖీ పర్వ దినాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన నలుగురు సోదరీమణులు ఒకరి తర్వాత మరొకరు రాఖీ కట్టారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అతని సోదరి అలేఖ్య రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, కోడలు, మనవడు, మనవరాలు పాల్గొన్నారు.

అటు హిమాన్షుకు ప్రగతి భవన్‌లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా రాఖీలు కట్టగా వాటిని పోస్ట్ చేసి హ్యాపీ రక్షా బంధన్ అని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ మేరకు తీసిన వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ఖాతా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మరో కార్యక్రమంలో తెలంగాణ మునిసిపల్, ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.

Updated : 12 Aug 2022 6:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top