Home > Featured > 100 మీటర్ల పరుగు 11 సెకన్లలో..కేంద్ర మంత్రి ఫిదా

100 మీటర్ల పరుగు 11 సెకన్లలో..కేంద్ర మంత్రి ఫిదా

100 మీటర్ల పరుగు పందెం అనగానే గుర్తుకు వచ్చేది ఉసెన్ బోల్ట్. కానీ దేహంలో కూడా ఒక ఉసేన్ బోల్ట్ ఉన్నాడని ఇటీవలే రుజువైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్‌ పరుగు వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆ వీడియోను చూసిన మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, దాన్ని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజుకు చేర్చడంతో, రామేశ్వర్‌లోని ప్రతిభకు రిజిజు ఫిదా అయ్యాడు. కనీసం చెప్పులు కూడా లేకుండా, తారు రోడ్డుపై 100 మీటర్ల పరుగును 11 సెకన్లలో పూర్తి చేశాడు.

ఈ వీడియోను చూపిస్తూ, ఇండియాలో నైపుణ్యానికి కొదవలేదని, సరైన వేదిక దొరికితే సత్తా నిరూపించుకునే వారు ఎందరో ఉన్నారని చెబుతూ, ఈ యువకుడికి మంచి సౌకర్యాలు కల్పిస్తే, దేశానికి పేరు తెస్తాడంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ, కిరణ్ రిజిజుకి ట్యాగ్‌ చేశారు. ఈ వీడియోను చూసిన రిజిజు, అతన్ని తన వద్దకు పంపాలని, అథ్లెటిక్స్‌ అకాడమీలో చేర్పించి మెరుగయ్యే శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

Updated : 18 Aug 2019 1:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top