వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. సోమాజిగూడ సర్కిల్ వద్ద షర్మిల వాహనాన్ని అడ్డుకోగా, ఆమె దిగనని మొండికేయడంతో రికవరీ వ్యాన్ తెచ్చి క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషనుకి తరలించారు. అంతకుమందు షర్మిల కారు డోర్ లాక్ చేసుకొని అందులోనే ఉండిపోయారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతో పాటు వాహనాన్ని తరలించక తప్పలేదు. స్టేషన్ వద్ద బలవంతంగా కారు డోర్ ఓపెన్ చేసి షర్మిలను పీఎస్ లోపలికి తీసుకెళ్లారు.
Interesting visual! As #YSSharmila locked herself in the car outside the camp office of CM #KCR, clueless cops had to tow the car with the #YSRTelanganaParty chief inside. She was shifted to SR Nagar PS. #Hyderabad #Telangana https://t.co/HzBixppVoC pic.twitter.com/Fm2T4rgFZW
— Ashish (@KP_Aashish) November 29, 2022
ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పీఎస్ కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, సోమవారం వరంగల్ లో షర్మిల కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని అధికార పార్టీ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఆ దగ్ధమైన వాహనాన్ని తీసుకొని సీఎం కేసీఆర్ కి చూపించాలని ప్రగతిభవన్ వైపు బయల్దేరారు. అయితే పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తానని చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. షర్మిల ప్రగతిభవన్ నే టార్గెట్ చేశారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.