నేడు దివంగత నేత సుష్మా స్వరాజ్ 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని.. ఆమె కుమార్తె బన్సూరి తన తల్లిని గుర్తుచేసుకుని పాత ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఎమోషనల్ క్యాప్షన్ జోడించారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ మరణించి మూడేళ్లు కావస్తున్నా..దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భారతీయులు ఆమెను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. ఆగస్ట్ 6, 2019న సుష్మా స్వరాజ్ ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
Remembering you on your birthday.
Tum Na Jaane Kis Jahan Mein Kho Gaye,
Hum Bhari Duniya Mein Tanha Ho Gaye……!https://t.co/KXHIbUlqHp pic.twitter.com/A0rn3QeH7z— Governor Swaraj (@governorswaraj) February 13, 2023
ఇప్పుడు ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్ తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకుని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన అమ్మ, నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో వివరించడానికి పదాలు సరిపోవు. మీ ప్రేమ, దీవెనలు, మీరు నాకు అందించిన విద్య ఎల్లప్పుడూ నాతో ఉంటాయి. నా మార్గాన్ని సుగమం చేస్తాయి. కూతురు బన్సూరి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసింది. ఈ ట్వీట్ను 2.5 లక్షల మందికి పైగా లైక్ చేసారు.
माँ @SushmaSwaraj जन्मदिवस की हार्दिक बधाई।
आपकी कितनी याद आती है इसकी अभिव्यक्ति के लिए शब्द पर्याप्त नही होते और भाषा सिमट कर रह जाती है। यह आश्वासन ज़रूर है कि आपका स्नेह, आशीर्वाद, संस्कार, और शिक्षा, सदैव मेरा मार्ग प्रशस्त करते रहेंगें।
Happy Birthday Ma.#SushmaSwaraj pic.twitter.com/oSbipDADGR— Bansuri Swaraj (@BansuriSwaraj) February 13, 2023
సుష్మా స్వరాజ్ భర్త, స్వరాజ్ కూడా తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘తుమ్ నా జానే కిస్ జహాన్ మే ఖో గయే హమ్ భారీ దునియా మే తన్హా హో గయే’ అని హిందీలో రాశారు. నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో నాకు తెలియదని, కానీ ప్రపంచం మొత్తంలో ఒంటరిగా ఉన్నామని రాశాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు సీనియర్ బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.